வாழிய செந்தமிழ்! வாழ்கநற் றமிழர்! வாழிய பாரத மணித்திரு நாடு! இன்றெமை வருத்தும் இன்னல்கள் மாய்க!

కె. ఎస్ రాధాకృష్ణన్

K S RADHAKRISHNAN

ప్రస్తుత తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని కురుంజకుళం గ్రామంలోని తెలుగు వ్యవసాయ కుటుంబంలో పేరం (కె.ఎస్.) రాధాకృష్ణన్ పుట్టారు. ఉన్నత చదువులు చదివి, న్యాయవాద వృత్తిలో పట్టా పుచ్చుకొన్నారు. రాజమండ్రికి చెందిన సరళను వివాహమాడారు. ఒక రాజకీయ కార్యకర్తగా ఎదిగి, న్యాయ నిపుణులుగా ప్రసిద్ధికెక్కి, మానవ హక్కులు, పర్యావరణం, వ్యవసాయంపై ఎక్కువ దృష్టి సారించారు. అంతేగాక, రచయితగా, కాలమిస్ట్‌గా ప్రాచుర్యం పొందారు.


రాధాకృష్ణన్ రాజకీయ ప్రయాణం అవలోకనం

కె.ఎస్.ఆర్‌ తన అర్ధ శతాబ్దం పైబడిన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అప్పటి ముఖ్యమంత్రులు కుమారస్వామి కామరాజ్, ఎమ్. జి. రామచంద్రన్, డి. ఎమ్. కె అధినేత కలైంజర్ ఎం. కరుణానిధి(దక్షిణామూర్తి), కుమారి జయలలిత, కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మీ కాంతమ్మ, నీలం సంజీవరెడ్డి, జలంగం వెంగళ రావు, నందమూరి తారక రామారావు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్, ఇ.వి.కె. సంపత్ వంటి రాజకీయదిగ్గజాలతో సత్సంబంధాలు ఉండేవి. అంతేగాక, సమీపదేశంమైన శ్రీలంకలోని టి.యు.ఎల్.ఎఫ్. (TULF) అధినేత ఎ. అమృతలింగం మరియు ఎల్.టి.టి. ఇ(LTTE)కి ఒకప్పటి నాయకుడు ప్రభాకరన్ శ్రీలంకలో తమిళుల ఉద్యమానికి నిరంతర మద్దతు ఇచ్చినందుకుగాను తొలినాళ్లలో అపారమైన గౌరవం కె.ఎస్. ఆర్. కలిగిఉండేవారు. వీరేగాక, కవి కన్నదాసన్, పళ నెదుమారన్, రైతు నాయకుడు సి. నారాయణస్వామి నాయుడు వంటివారితో కె.ఎస్.ఆర్‌కు స్నేహబంధం ఉండేది.

కె.ఎస్‌.ఆర్. రాజకీయ కార్యకర్తగా, జైళ్ల లోపలి గోడలను చాలాసార్లు చూశాడు!

ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం డి.ఎమ్.కె. పార్టీకి అధికార ప్రతినిధిగా నామినేట్ అయిన అతి పిన్న వయస్కుడైన మొదటి వ్యక్తిగా ప్రసిద్ది పొందాడు. తన యాభై నాలుగు సంత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. అనేకసార్లు జైలుకు వెళ్ళి వచ్చారు. రాజకీయాలలో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చారు. నిష్కళంకమైన ప్రజా జీవితాన్ని గడుపుతున్నారు. మృదుస్వభావి అయిన కె. ఎస్. ఆర్‌ గారు ప్రజా సంక్షేమంకోసం పాటుపడుతూ రాజకీయ కార్యకలాపాల్లో ఎల్లప్పుడూ విశ్వసనీయమైన, నిజమైన వ్యక్తిత్వాన్ని కలిగిఉన్నారు.

కె.ఎస్.ఆర్. న్యాయవాదిగా నిరంతరం ప్రజలపక్షం!

Photo 1 Photo 2 Photo 3

ప్రజలు ఎదుర్కొంటున్న వ్యవసాయం, పర్యావరణం, మానవ హక్కులకు సంబంధించి సమస్యలను న్యాయస్థానాలలో ఎత్తిచూపుతూ, పరిష్కారాలు, ఉపశమనం కోరుతూ ఉంటారు. అలాగే పశ్చిమ కనుమలలో పర్యావరణ సమస్యల గురించి ఆయన విస్తృతమైన అధ్యయనం చేశారు. పశ్చిమ, తూర్పు కనుమల సంరక్షణలో పర్యావరణ ఆందోళనపై న్యాయస్థానాలు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ( N.G.T) తలుపులు తట్టారు.

Photo 1 Photo 2 Photo 3

కోర్టుల ముందు కె.ఎస్.ఆర్. దాఖలు చేసిన ముఖ్యమైన వాజ్యాలు (PETITIONS):


కొన్ని పుస్తకాల శీర్షికలు


The woods are lovely, dark and deep, But I have promises to keep,
And miles to go before I sleep.